నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశాను:ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశాను:ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశానని చెప్పారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ గూడ, కొత్వాల్ గూడ, ఘాస్మియ గూడ గ్రామలలో రైతులకు పట్టా పాసు పుస్తకాల సమస్యలు ఉన్నాయని.. వాటితోపాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు.

దీంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో సమస్యల పరిష్కారం చేద్దామని అన్నారని తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.