అర్హులందరికీ బీసీ బంధు ఇవ్వాలి: రఘునందన్ రావు

అర్హులందరికీ బీసీ బంధు ఇవ్వాలి: రఘునందన్ రావు

బీసీలందరికీ బీసీ బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నా చేపట్టారు. బీసీలందరికీ బీసీ బంధు ఇవ్వాలని బీఆర్ఎస్​ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీసీలోని చాలా కులాల్లోని వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని రఘునందన్ రావు తెలిపారు. కొందరికే బీసీ బంధు ఇవ్వడం సరికాదని, అర్హులైన అందరికీ ఇవ్వాలని డిమాండ్​చేశారు. రోడ్డుపై లబ్ధిదారులు బైఠాయించడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి.. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.