ప్రగతిభవన్ కు వెళ్లిన రాజాసింగ్ అరెస్ట్.. ఆ తర్వాత అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు

ప్రగతిభవన్ కు వెళ్లిన రాజాసింగ్ అరెస్ట్.. ఆ తర్వాత అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు

ప్రగతిభవన్ వద్ద అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు. రాజసింగ్ సింగ్ ని డీసీఎం వాహనంలో అసెంబ్లీకి తీసుకెళ్లారు. మీడియాకు కనబడకుండా డీసీఎంకు పరదాలు కట్టి తీసుకెళ్లారు. 

అంతకుముందు ఏం జరిగింది..? 

పోలీసులు అరెస్ట్ చేసి, తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియోలు విడుదల చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతిభవన్ కు వెళ్తే.. గేటు వద్దే తనను ఆపేశారని చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోలేదని, దాంతో వాటిని అక్కడే పాడేశానని చెప్పారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ వచ్చి తనను అరెస్ట్ చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని తెలిపారు. 

ప్రగతిభవన్ వెళ్లే ముందు తన వెంట ఉన్న గన్ మెన్లను తీసుకెళ్లలేదని, ఒంటరిగానే వెళ్లానని తెలిపారు. పాడైన బూల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఎందుకు కేటాయించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగేందుకే ప్రగతిభవన్ వెళ్లానని చెప్పారు.