పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్‎‎

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్‎‎

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎‎ను పోలీసులు  అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులు గాయపడగా.. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కొంతమందితో కలిసి ఎల్లారెడ్డి పేటకు బయలుదేరారు. దాంతో పోలీసులు రాజాసింగ్ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

కాగా.. నిన్న రాత్రి జరిగిన గొడవలో బీజేపీ నేత రెడ్డబోయిన గోపి గన్ తీసుకొచ్చి బెదిరించాడని మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్.. గోపి గన్ లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.