తడిసిన వడ్లు ప్రభుత్వం  కొనకపోతే నేను కొంటా : మహమ్మద్ షకీల్​

తడిసిన వడ్లు ప్రభుత్వం  కొనకపోతే నేను కొంటా : మహమ్మద్ షకీల్​

ఎడపల్లి, వెలుగు: తడిసిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తే నేనే  కొంటానని  బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్​మినీ ప్లీనరీ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రభుత్వం తన రైస్​మిల్లులకు వడ్లు కేటాయిస్తే,  నేను తిరిగి సీఎంఆర్​ఇవ్వడం లేదని  ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదన్నారు.

అందుకే ఈసారి ప్రభుత్వం మిల్లులకు వడ్లను కేటాయిస్తే తిరస్కరించానని తెలిపారు.  సొంత పైసలతో రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించుకున్నానన్నారు. అంతకు ముందు ప్లీనరీని ప్రారంభించిన షకీల్​తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరులకు నివాళి అర్పించారు.

 జడ్పీ చైర్మన్​విఠల్​రావు, వైస్​చైర్ పర్సన్ రజిత యాదవ్, జిల్లా సర్పంచ్​ల పోరం ప్రెసిడెంట్​ శ్రీనివాస్,  బీఆర్ఎస్​లీడర్లు పాల్గొన్నారు.