కేసీఆర్ రైతులను మోసం చేశారు

కేసీఆర్ రైతులను మోసం చేశారు

రైతు ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు పక్క రాష్ట్రంలో రైతుల మీద ఉన్న ప్రేమ తెలంగాణలోని అన్నదాతలపై లేదని విమర్శించారు. అప్పుల బాధ తట్టుకోలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే..వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన నాయకులు వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల ఆత్మ హత్యలు చేసుకున్న గోవిందా రావు పేట,ములుగు మండలానికి చెందిన రైతు కుటుంబాలు తప్పెట్ల స్వరూప, మేడ సంధ్య,గువ్వ సరిత, అరిగెల రాజేంద్ర కుటుంబాలకు కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే సీతక్క రూ. 50 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేసిందని గుర్తు చేశారు.