దొంగలను పట్టుకోవటానికి నేనూ వస్తా : ఎమ్మెల్యే శ్రీహరి

దొంగలను పట్టుకోవటానికి నేనూ వస్తా : ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, వెలుగు: పట్టణంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని, రాత్రి పూట అవసరమైతే తాను గస్తీకొస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే సీఐ రాంలాల్​తో ఫోన్​లో మాట్లాడారు. మక్తల్ పట్టణంలో జరుగుతున్న దొంగతనాలకు గస్తీ అవసరం అయితే తాను వస్తానని, దొంగల ఆట కట్టిద్దామని పేర్కొన్నారు.

పట్టణంలోని 7, 8 వార్డుల్లో రాత్రి పూట దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా గస్తీ పెంచడం లేదని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సీఐ రాంలాల్​కు ఫోన్​ చేసి దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో కాలనీలో  పోలీసుల గస్తీ పెంచాలని సూచించారు.