స్టేషన్ ఘన్ పూర్ నా అడ్డా

స్టేషన్ ఘన్ పూర్ నా అడ్డా

టీఆర్ఎస్ MLC కడియం శ్రీహరిపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తనపై చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. 1994లో ఎమ్మెల్యే కాకముందు కడియం ఆస్తిపాస్తులు ఎంత అని రాజయ్య ప్రశ్నించారు. ఆ ఆస్తులన్నీ ఎలా సంపాదించారో చెప్పాలని నిలదీశారు. కడియంపై ఓ బుక్ కూడా రిలీజ్ అయ్యిందని.. అందులో అన్ని విషయాలు ఉన్నాయన్నారు.

14  ఏళ్లు మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి నియోజకవర్గం కోసం ఏం చేశారని రాజయ్య ప్రశ్నించారు. ఆయన గురించి తెలుసుకోవాలంటే.. టీడీపీ కార్యకర్తలను అడిగితే తెలుస్తుందన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారని రాజయ్య విమర్శించారు. వైఎస్ తనకు రాజకీయ గురువన్న ఆయన.. ఇప్పుడు కేసీఆర్ తన దేవుడని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ తన అడ్డా అని రాజయ్య మరోసారి స్పష్టం చేశారు.