మల్లు రవి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు : తూడి మేఘారెడ్డి

మల్లు రవి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: నాగర్ కర్నూల్  ఎంపీగా మల్లు రవిని గెలిపించుకుంటే మల్లు రవి కేంద్ర మంత్రి అవుతారని, దీంతో వనపర్తి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ, కందకం, టౌన్​చర్చి, 17వ వార్డుల్లో మార్నింగ్​ వాక్​ చేశారు. ఇంటింటికీ తిరిగి గ్యారంటీ పథకాల కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజలు బీఆర్ఎస్​పై విరుచుకుపడుతున్నారని, బీజేపీకి ఓట్లేయమని చెబుతున్నారన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్​ఎన్నికల్లోనూ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తరువాత కొత్త రేషన్​కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని చెప్పారు. మున్సిపల్​ చైర్మన్​ పుట్టపాకుల మహేశ్, వైస్​ చైర్మన్​ పి కృష్ణ, శంకర్ ప్రసాద్,  సతీశ్, చీర్ల విజయచందర్, కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం, బ్రహ్మచారి, భువనేశ్వరి, చంద్రకళ,   మార్కెట్  కమిటీ మాజీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు. ఇదిలాఉంటే పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామానికి చెందిన 70 మంది బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు, 80 మంది మార్కెట్​ యార్డ్​ హమాలీ సంఘం సభ్యులు పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.