అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం : విజయరమణారావు

అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో శనివారం వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్, షాదిఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.

మానేరు వాగు నుంచి లారీల ద్వారా ఇసుక తరలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. లీడర్లు మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, లీడర్లు కోడెం సురేఖ, అజయ్, శ్రీగిరి శ్రీనివాస్, డి.దామోదర్ రావు, సతీశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.