
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొంది ఏడాది పూర్తైన సందర్భంగా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కేక్ కట్ చేసి ఎంపీ వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లిలో కాకా బ్రాండ్ ఉందని..అందుకే ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కాక బ్రాండ్ అలాగే కొనసాగుతుందని.. ఎవరు ఆపలేరు గుర్తుపెట్టుకోండని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమమే కాకా కుటుంబం లక్ష్యమని అన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకే మేము ఉన్నామని.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాకా కుటుంబానికి కంచుకోట అని అన్నారు. నలబై ఏండ్ల నుండి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు కాకా కుటుంబాన్నీ ఆదరిస్తూ కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తున్నారని అన్నారు.పదవుల కోసం కాదు.. తెలంగాణ కోసం కొట్లాడినామని.. రామగుండం ఫర్టీలైజర్ కార్పొరేషన్ ఇండియా ఫ్యాక్టరీని రీ ఓపెనింగ్ చేపించేందుకు కాకా కుటుంబమే చేసిన కృషి వల్లనే రామగుండం,ఒడిస్సా లో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలను ప్రారంభించారని అన్నారు.
త్రాగు నీటి సమస్య పరిష్కారం కోసం పెద్ద పల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో 2 వేల బోర్లు వేయించామని.. కాకా కుటుంబానికి పెద్దపల్లి నియోజక వర్గ ప్రజలకు ఎవరు వీడదీయలేని బంధం ఉందని అన్నారు. కాకా వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడి లక్ష ఉద్యోగులకు భవిష్యత్తు నిచ్చాడని అన్నారు వివేక్. కాకా కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేసేందుకు వచ్చామని అన్నారు.