తెలంగాణలో ప్రజా పాలన మొదలైంది: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

తెలంగాణలో ప్రజా పాలన మొదలైంది: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

ధర్మపురి: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని  కొండాపూర్ గ్రామ పంచాయతీ కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించారు.  కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్​ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఫండ్ నుంచి రూ. 5 లక్షలతో జీపీని నిర్మించారన్నారు. 2009 లో పెద్దపల్లి నుంచి తాను ఎంపీగా గెలుపొందడంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. 

జీవన్ రెడ్డిని కలిసిన ప్రతిసారి ఒక మంచి విషయం నేర్చుకున్నానని చెప్పారు. గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్న నేత అడ్లూరి లక్ష్మణ్ అని కొనియాడారు. తెలంగానలో ప్రజా పాలన మొదలైందన్నారు. ప్రజా ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందుండాలని  సీఎం సూచించారన్నారు.   ధర్మపురి ప్రాంత అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.  2009 లో రాయపట్నం నుంచి లక్షట్ పేట్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. చెన్నూర్ రివ్యూ మీటింగులో అక్కడి మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కనిపించలేదని ఆయన చెప్పారు.