జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: సమాజానికి జర్నలిస్టులు చేసే సేవ గొప్పదని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. రాష్ర్టంలో ప్రజల పాలన ప్రారంభమైందని, మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కొన్నేండ్లుగా జర్నలిస్టుల సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. 

మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను అందించేందుకు అధికారులు పని చేయాలని సూచించారు. వచ్చే ఐదేండ్లలో మండలాన్ని రాష్ర్టంలోనే నెంబర్ వన్ గా నిలుపుదాం అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయ నిర్మల, సర్పంచ్ రేవతి సత్యం, తహసీల్దార్​ కిష్టానాయక్ పాల్గొన్నారు.