ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారు

ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారు
  • పీకే డైరెక్షన్ లో బీజేపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

మిర్యాలగూడ: ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో బీజేపీపై కేసీఆర్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు. టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు, గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దోచుకొని ఎన్నికల్లో ఖర్చుపెట్టే ధోరణిలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. అవినీతి సొమ్ముతో వందకోట్లతో ఇల్లు కొనేందుకు ఎంపీ సంతోష్ లండన్ వెళ్లాడని ఆరోపించారు రఘునందన్. సీఎంతో సహా ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వమే వడ్లు కొనాలంటూ..నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ నిర్వహించిన రైతు సదస్సులో రఘునందన్ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రాష్ట్రంలో కేసీఆర్ కొత్త పంచాయతీ పెడుతున్నాడని.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వడ్లు ఎవరు కొన్నారు ? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కొనలేదా...? అప్పుడు కొన్నాం.. ఇప్పుడూ కొంటామని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. 
దొచుకునేంత దోచుకుందం ...ఎలక్షన్ వచ్చినపుడు కర్చుపెడదాం అనే ధోరణిలో కేసీఆర్
తెలంగాణలో దొచుకునేంత దోచుకుందం ...ఎలక్షన్ వచ్చినపుడు కర్చుపెడదాం అనే దోరణిలో ముఖ్యమంత్రి ఉన్నాడని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అబద్ధాలు, మాయ మాటలు, మాటల గారడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది మాత్రమే చేస్తారు... చేసేదే చెప్తారని వివరించారు.  

 

 

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్ ధర్నాలో మున్సిపల్ ఛైర్ పర్సన్కు అవమానం

ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్

కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి