ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం చేయాలె

ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం చేయాలె

ప్రజలే కోరుకుంటున్నరు: జీవన్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. సీఎం పదవికి మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్థుడే కావొచ్చు.. కానీ ఆయనకు వారసత్వంగా పదవి ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయని చెప్పారు. ఈటలను సీఎం చేస్తే, అలాంటి విమర్శలు ఎదురుకావని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఈటల సీఎం కావాలన్నది తన అభిప్రాయం కాదని, ప్రజలే కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. ఈటల లాంటి సమర్థ నాయకుడు సీఎం అయితే తాను సంతోషిస్తానని.. ఆయనకు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తారని తెలిపారు. కాగా, పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ జీవన్ రెడ్డి సీఎంకు లెటర్ రాశారు.

For More News..

బేటీ బచావో స్కీం కింద రాష్ట్రానికి 7 కోట్లు

ఈ నెలలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ వారం పొడిగింపు

మేయర్ పోస్టుకు పోటీచేయాలని మజ్లిస్‌కు టీఆర్ఎస్ ఆఫర్