హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నిర్వహించే బోనాల పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో, ఆదివారం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో బోనాల పండుగలో ఆమె పాల్గొంటారు. భారత జాగృతి ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో బ్రిస్బేన్లోని గాయత్రి మందిరంలో అక్కడి మంత్రులు, ఎంపీలు, తెలంగాణ ఎన్ఆర్ఐలతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొంటారు.
ఆక్లాండ్లోని గణేశ్టెంపుల్లో తెలంగాణ సెంట్రల్అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నారు. అక్కడే ప్రవాస భారతీయుల సమ్మేళనంలోనూ కవిత పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’లో పాల్గొంటారు.
