భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని  కేబీఆర్ పార్క్ వద్ద  భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు  నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.  గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుకళాకారుల ప్రదర్శన అందనీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. భారత జాగృతి ఆధ్వర్యంలో మొదటి  సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాత ఆలోచనలన్నింటినీ భోగిమంటల్లో కలిపి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లడం ఈ పండగ ఉద్దేశమని అన్నారు.