తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుకళాకారుల ప్రదర్శన అందనీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. భారత జాగృతి ఆధ్వర్యంలో మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాత ఆలోచనలన్నింటినీ భోగిమంటల్లో కలిపి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లడం ఈ పండగ ఉద్దేశమని అన్నారు.