హైదరాబాద్, వెలుగు: సింగరేణి విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. సింగరేణి స్కూళ్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆదివారం హైదరాబాద్లో కవితను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సింగరేణిని కాపాడారని చెప్పారు.
టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై సీఎంతో చర్చిస్తానని, అవసరమైతే సీఎం, సింగరేణి కార్మిక నాయకులతో సమావే శం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. కవితను కలిసిన వారిలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి, సంఘం నాయకులు ఉన్నారు.