
బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న రైల్ రోఖో చేపడుతామని చెప్పారు కవిత. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత..బీసీ బిల్లు సాదించాలంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి. జూలై 17న రైల్ రోఖో చేపడుదాం. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతామని చెబుతుంది. బిసిలకు 42శాతం రిజర్వేషన్ లు ఇవ్వకుండా ఎన్నికలకు పొతే పోరాడుతాం. పోరాడితే బీసీ బిడ్డల కాళ్ళ వద్దకు పదవులు వస్తాయి. బీసీలంతా చైతన్యం కావాలి. అసెంబ్లీ గడపను ఎక్కనివాళ్ళు ఎంతో మంది బీసీలు ఉన్నారు. బీసీల మీటింగ్ కు ఎందుకు పోతారని అగ్రవర్ణాలు బెదిరిస్తున్నారు. ఇది రాజకీయ వేదిక కాదు.. మానవ హక్కుల వేదిక. బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పోరాడాల్సిన అవసరం ఉంది.
ALSO READ | గుడ్ న్యూస్: ఇవాళ(జూన్17) 3 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు
బీసీలు అడగకపోతే తీరని నష్టం జరుగుతుంది. విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు వేర్వేరు బిల్లులు పెట్టాలి. తెలంగాణ లోని అన్ని జిల్లాలో బిసి బిల్లు గురించి మాట్లాడాలి. ఢిల్లీకి బిల్లు పంపినం మాకు సంబంధం లేదని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బిసి బిల్లు గురించి మాట్లాడారా.? బీసీ బిల్లు గురించి ఎంపీని ప్రశ్నించాలి. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయి . కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చిత్తశుద్ధి లేదు. కరెక్ట్ ఉంటే గ్రామాల్లో పంచాయితీల దగ్గర కులగణన లెక్కలు డిస్ ప్లే చేయాలని అన్నారు కవిత.