- గ్యాస్ ధర రూ.800 పెంచి 200లే తగ్గిస్తరా
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
హైదరాబాద్, వెలుగు : వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు స్వల్పంగా ధర తగ్గించి అదేదో గొప్పగా చెప్పుకుంటున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గ్యాస్సిలిండర్ల ధర తగ్గింపుపై మంగళవారం ఆమె ట్వీట్చేశారు. ధర తగ్గించడం కానుక కాదని జేబులను గుల్ల చేసి దగా చేయడమన్నారు. పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్సిలిండర్ధర రూ.800 పెంచిందని, ఇప్పుడు రూ.200 మాత్రమే తగ్గించిందన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడానికే కేంద్రం నామమాత్రంగా ధర తగ్గించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.