- ఎమ్మెల్సీ కోదండరాం
ఉప్పల్, వెలుగు: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తార్నాకలో ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం చీఫ్గెస్ట్గా హాజరై, మాట్లాడారు. వృద్ధులు హక్కులను రక్షిస్తూ వారు గౌరవంగా, భద్రతతో జీవించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరసింహారావు, సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్కోసం వేధింపుల నిరోధక చట్టం ఉన్నా.. అమలులో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు వృద్ధులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
