ఫిబ్రవరి 17ను రైతుబంధు దినోత్సవంగా నిర్వహిస్తాం

ఫిబ్రవరి 17ను రైతుబంధు దినోత్సవంగా నిర్వహిస్తాం

కేసీఆర్ జన్మదినోత్సవం ఫిబ్రవరి 17ను రైతుబంధు దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.  2600 క్లస్టర్స్ లో  వేడుకలు ఉంటాయన్నారు. విద్యుత్ సంస్కరణలపై ముసాయిదాను వ్యతిరేకంగా తీర్మానం చేసి  పంపించామన్నారు. భారోయింగ్ పవర్ తో 25 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. గ్రీన్ పవర్ అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. చదువురాని  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే రెట్టింపు స్థాయిలో సమాధానం చెబుతామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గులేకుండా  మాట్లాడుతున్నారన్నారు. లంకలో పుట్టిన వారంతా రావణులే అన్నట్లు.. బీజేపీలో పుట్టిన వారంతా కుసంస్కారహీనులేనన్నారు. బండి సంజయ్ విద్యుత్ పై పాఠాలు నేర్చుకోని.. ఆర్మీపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే