బిల్డప్ మెయింటెయిన్​ చేస్తేనే నాయకులుగా చలామణి అవుతారు:ఎమ్మెల్సీ రవీందర్ రావు

బిల్డప్ మెయింటెయిన్​ చేస్తేనే నాయకులుగా చలామణి అవుతారు:ఎమ్మెల్సీ రవీందర్ రావు

గద్వాల, వెలుగు: బాధలు ఎన్ని ఉన్నా మనం బిల్డప్ మెయింటెయిన్​ చేస్తేనే నాయకులుగా చలామణి అవుతారని ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్నారు. ఆదివారం జోగులాంబ  గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన రవీందర్​రావు మాట్లాడుతూ.. లీడర్లుగా ఎదగాలంటే బిల్డప్ ఉండాలన్నారు.

కారు, మంచి ఇల్లు, భార్య మెడలో గోల్డ్, పిల్లలను మంచి స్కూల్​లో చదివించడం, మంచి ఫోన్ ఉండడం ఇలా అన్ని మెయింటెయిన్​చేస్తేనే లీడర్ గా ఎదుగుతారని, నలుగురూ మన దగ్గరకు వస్తారన్నారు. ఈ స్టేజీ మీద ఉన్నవారు సైతం అలానే ఎంపీపీలు, జడ్పీటీసీలు అయ్యారన్నారు. కానీ వారి బాధలు చెప్పుకుంటే వర్ణణాతీతంగా ఉంటాయని, అయినా అలాగే ఉండక తప్పదన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.