హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పడమర, వాయువ్య దిశ నుంచి రాష్ట్రానికి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు పడతాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం సోమవారం ఆదిలాబాద్లోని జైనద్లో 44 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫబాద్లోని కెరమెరిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.