మోడీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు

మోడీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు

లక్నో: బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి, ప్రధాని మోడీ కలిసి ఉన్న ముప్పై ఏండ్ల కిందటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1991లో రామ మందిర ఉద్యమం టైమ్లో మోడీ అయోధ్య వెళ్లారు. ఆ సందర్భంగా జోషితో మోడీ ఉన్న ఫొటోను అక్కడి లోకల్ ఫొటో గ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి తీశారు. చారిత్రాత్మకమైన ఈ ఫొటోను తీసినందుకు ఎంతో గర్వంగా ఉందని త్రిపాఠి మీడియాతో చెప్పారు. గుజరాత్ బీజేపీ నేత అంటూ మోడీని మిగతా జర్నలిస్టులకు జోషి పరిచయం చేశారని, ఆ టైంలో మేమంతా ఆయనను మళ్లీ అయోధ్యకు ఎప్పుడొస్తారని అడగ్గా.. రామ మందిర నిర్మా ణానికి వస్తానని మోడీ చెప్పారని త్రిపాఠి గుర్తు చేశారు. ముప్పై ఎండ్లకింద ఇచ్చిన మాటను మోడీ ఇప్పడు నిలబెట్టుకుంటున్నారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..