- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, వెలుగు : అగ్నిపథ్ కుట్రదారు ప్రధాని మోడీనేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉద్యోగ భద్రత లేని ఈ స్కీంపై కడుపు మండిన యువత, కేంద్రంపై తిరగబడుతోందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఘటన వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వ హస్తముందని మార్ఫింగ్ వీడియోలు, ఆడియోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆందోళనల వెనక టీఆర్ఎస్, ఇతర పార్టీలుంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.