ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

గత ఎన్నికల్లో TDPతో జట్టుకట్టిన బీజేపీ మారిన పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఒంటరిగానే పోటీచేస్తోంది. అయితే..ప్రధాని నరేంద్ర మోడీ మ్యాజిక్ చేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు వర్గాలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ‘మళ్లీ మోడీ’ నినాదంతో పాంఫ్లెట్స్ ఫ్రింటింగ్ చేయించిన పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో మోడీ ఏపీ వస్తుండడం స్థానిక శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తోంది. మోడీ ఈనెల 29న ఏపీకి రానున్నారు. అదే రోజున కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే మరో సభకు హాజరవుతారు. దీనికి సంబంధించి ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.