మొరాదాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో సంబంధంలేదని, దేశ సాంస్కృతిక విలువలను పెంపొందించడమే దాని లక్ష్యమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. దీనికోసం 60 ఏళ్ల నుంచి పాటుపడుతున్నామని వివరించారు. బీజేపీని ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 130 కోట్ల మంది భారతీయుల కోసం తాము పనిచేస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో శనివారం జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో భగవత్ ఈ కామెంట్స్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల వారు ఆరెఎస్ఎస్ లో ఉన్నారని, అందులో కొంతమంది రాజకీయ పార్టీలను నడుపుతున్నారని చెప్పారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు, మేధావులు ఆర్ఎస్ఎస్ లో భాగం కాకున్నా.. సంస్థ భావజాలంతో ఏకీభవించేవారని, ఇది ఆర్ఎస్ఎస్ సాధించిన విజయమని భగవత్ చెప్పారు.
For More News..