మట్టి కలశంతో ఇలా పూజలు చేయండి.. ఇక డబ్బే డబ్బు..

మట్టి కలశంతో ఇలా పూజలు చేయండి.. ఇక డబ్బే డబ్బు..

ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు చెబుతుంటారు.. అందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక చిన్న మట్టి కుండ తీసుకోవాలి. ఇందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. రోజులు గడిచేకొద్ది కాలం కలిసి రావచ్చని ... . ఈ పరిహారంతో పాటు జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలను కూడా పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.. డబ్బులు ఆదా అవుతాయని పురాణాల్లో కూడా పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు.

కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని  ఎరుపు, పసుపు దారాలతో  కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చేస్తే   లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుందని అష్టాదశ పురాణాల్లో పేర్కొన్నారు. అలాగే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.. అదే విధంగా ప్రతి శుక్రవారం, మంగళవారం  లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి.. గుడి నుంచి వచ్చిన తర్వాత కూడా అమ్మవారిని పూజించాలి.. అప్పుడే అమ్మవారి కటాక్షం ఉంటుందని పండితులు చెబుతున్నారు.. ఇలా పదకొండు శుక్రవారాలు చెయ్యడం వల్ల మంచి ఫలితారు ఉంటాయి.. ఈ పరిహారాలన్ని చేసి మంచి ఫలితాలను పొందండి.