ఎయిర్ పోర్టులో 14 లక్షలకు పైగా ఫారిన్ కరెన్సీ సీజ్

ఎయిర్ పోర్టులో 14 లక్షలకు పైగా ఫారిన్ కరెన్సీ సీజ్
  • ప్యాసింజర్ అరెస్ట్

శంషాబాద్, వెలుగు : ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ పై అనుమానంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు.

అందులో 17 వేల 900 యూఎస్ డాలర్లను గుర్తించారు. వాటి విలువ ఇండియన్ కరెన్సీలో రూ.14 లక్షల 74 వేల 960 ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్ పై కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు.