మొరాకోలో గత 50 ఏండ్లలో అతి పెద్ద భూకంపం..

మొరాకోలో గత 50 ఏండ్లలో అతి పెద్ద భూకంపం..

గత నాలుగైదు దశాబ్దాలలో మొరాకోలో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. 1960లో అగాదిర్ సిటీలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని, అప్పుడు వేలాది మంది చనిపోయారని చెప్పారు. 2004లో అల్ హోసిమా సిటీలో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని, అప్పుడు 600 మందికి పైగా చనిపోయారని పేర్కొన్నారు.

అండగా ఉంటాం: మోదీ 

మొరాకో భూకంపంపై ప్రపంచ దేశాల నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మొరాకోకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘‘ఈ కష్ట సమయంలో ప్రపంచమంతా మీతో ఉంటుంది. మీకు అవసరమైన సాయం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని మన దేశ ప్రధాని మోదీ చెప్పారు. మొరాకోను ఆదుకుంటామని రష్యా, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, తైవాన్, యూఏఈ, అల్జీరియా, ఇజ్రాయెల్, ఇటలీ, టునీషియా, రొమేనియా తదితర దేశాలు ప్రకటించాయి.