ప్రిగోజిన్ మరణంపై రష్యా అధికారిక ప్రకటన

ప్రిగోజిన్ మరణంపై రష్యా అధికారిక ప్రకటన

రష్యా ప్రభుత్వంపై తిరుగుబాటు దారుడు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధృవీకరించింది. విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో జన్యూ పరీక్షలు పూర్తయ్యాయని.. 10 మంది మృతుల్లో ప్రిగోజిన్ ఉన్నట్లు వెల్లడించింది. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో తొమ్మిది మందిని కూడా గుర్తించారు. 

ఆగస్టు 23న రష్యాలోని తెవర్ రీజియన్‌లోని కుజెంకినోలో విమానం కుప్పకూలడంతో ప్రిగోజిన్‌తోపాటు మరో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది ప్రమాదం కాదని.. మిసైల్ లేదా బాంబు దాడితో ప్రిగోజిన్‌ను చంపేశారని  అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ప్రిగోజిన్ మరణం వెనుక రష్యానే కుట్ర పన్నిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.  ఈ క్రమంలో జెన్యూ పరీక్షలు చేసి ప్రిగోజిన్ మరణించారని  రష్యా అధికారులు ప్రకటించారు.