హైదరాబాద్ రాజేంద్రనగర్ లో .. మహిళా కానిస్టేబుల్ పై తల్లీకూతుళ్ల దాడి..

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో .. మహిళా కానిస్టేబుల్ పై తల్లీకూతుళ్ల దాడి..

గండిపేట, వెలుగు: కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌‌‌‌పై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్​లోని బుద్వేల్‌‌‌‌కు చెందిన సంగీత, ఆమె కూతురు కలిసి పక్కనుండే మరో మహిళతో గొడవ పడ్డారు. 

స్థానికులు 100కు ఫోన్‌‌‌‌ చేసి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు చేరుకున్నారు. ఓ కానిస్టేబుల్‌‌‌‌ ట్యాబ్‌‌‌‌లో వీడియో తీస్తుండగా మరో లేడీ కానిస్టేబుల్​ గొడవపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సంగీత ట్యాబ్‌‌‌‌ను లాక్కొని పగులగొట్టింది. అంతేగాకుండా మహిళా కానిస్టేబుల్​పై తల్లీకూతుళ్లు దాడికి పాల్పడ్డారు. 

కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరీ, ఆమె కుమార్తె  లపై రాజేంద్రనగర్ పోలీసులు 221  132, 74, 351(2), 352, 324(4) రెడ్ విత్ 3,5 బీఎన్ఎస్. 3పీడీపీపీఏ సెక్షన్ ల ప్రకారం కేసు లు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు....