కంటైనర్ లారీ ఢీకొని తల్లీకొడుకు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ తండ్రి

కంటైనర్ లారీ ఢీకొని తల్లీకొడుకు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ తండ్రి
  • ఆసిఫాబాద్​లో ప్రమాదం

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ నేషనల్ హైవే బైపాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు చనిపోయారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ కు తరలించారు. కాగజ్ నగర్ మండలం బట్టుపల్లికి చెందిన సర్వర్ తన భార్య సహెరా భాను(35), కొడుకు ఆసిఫ్(16)తో కలిసి ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు.

ఆసిఫాబాద్ దాటిన తర్వాత జంక్షన్ వద్ద నేషనల్ హైవే పైకి వెళ్తున్న క్రమంలో రెబ్బెన వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ వీరి బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తల్లీకొడుకులు కిందపడగా వారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సర్వర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మృతుల బంధువులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నేషనల్ హైవే పై డెడ్​బాడీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్​కు కారణమైన కంటైనర్​ డ్రైవర్​లొంగిపోయాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.