పెద్దపల్లి జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన స్వామి హమాలీ పనిచేస్తూ భార్య విజయ, కుమారుడు శివకృష్ణ (3), కూతురు శ్రీకృతి(2)తో నివసిస్తున్నాడు. స్వామి తండ్రి చనిపోవడంతో తల్లి; భర్త చనిపోవడం స్వామి సోదరి పద్మ కూడా వీరితోపాటే ఉంటున్నారు. అయితే స్వామి భార్య విజయతో అత్త, ఆడపడుచు నిత్యం గొడవ పడేవారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా విజయతో వారిద్దరూ గొడవపడ్డారు. దాంతో విజయ వెంటనే భర్తకు ఫోన్ చేసి గొడవ గురించి చెప్పింది. దానికి స్వామి.. తాను పనిలో ఉన్నానని.. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పాడు. ఆ తర్వాత స్వామి రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి విజయ, పిల్లలు ఇంట్లో లేరు. మరుసటి రోజు ఉదయాన్నే గ్రామంలో వెతుకుతుండగా.. స్థానికంగా ఉన్న బావిలో పిల్లల శవాలు తేలాయి. అదేవిధంగా విజయ చెప్పులు కూడా అదే బావిలో తేలుతూ కనిపించాయి. పిల్లల శవాలను చూసి తీవ్ర రోదనకు గురైన స్వామి.. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పిల్లల శవాలను బయటకు తీసి.. తల్లి విజయ శవం కోసం బావిలో గాలిస్తున్నారు. స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఆడపడచుతో గొడవ పడి పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న తల్లి
- తెలంగాణం
- April 21, 2021
లేటెస్ట్
- Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?
- జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్
- Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
- తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...