ఏపీ: ఓ మహిళ బిడ్డతో సహా గోదావరిలో దూకిన సంఘటన గురువారం ప.గో. జిల్లాలో జరిగింది. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో గుర్తుతెలియని తల్లి, కుమార్తె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.