హైదరాబాద్, వెలుగు: మల్టీ బ్రాండ్ ప్రీమియం టూ వీలర్ సంస్థ మోటోహాస్ హైదరాబాద్లో షోరూమ్ను ప్రారంభించింది. హైందవి ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో ప్రీమియం యూరోపియన్ బ్రాండ్లు అయిన బ్రిక్స్టన్ బైక్స్, వీఎల్ఎఫ్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇది దేశంలో కంపెనీకి 14వ షోరూమ్. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 16 షోరూమ్లను తెరవాలని మోటోహాస్ యోచిస్తోంది. ఈ సందర్భంగా బ్రిక్స్టన్ క్రాస్ఫైర్ 500ఎక్స్, క్రాస్ఫైర్ 500ఎక్స్సీ మోటార్సైకిళ్లతో పాటు వీఎల్ఎఫ్ మోబ్స్టర్ 135 పెట్రోల్ స్కూటర్, వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించారు.
