
ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజైన 50 రోజుల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ఒప్పందాలు జరిగే సినిమాలకు ఈ కొత్త నింబంధన వర్తిస్తు్ంది. భారీ బడ్జెట్ నుంచి లో బడ్జెట్ మూవీస్ వరకు అన్నీ రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం వల్ల థియెటర్ల పై ప్రభావం పడుతుందని, హీరోల క్రేజ్ కూడా తగ్గుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో భేటీ అయిన నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.