ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఇఫ్తార్  విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

పాలమూరు, వెలుగు: జిల్లా కేంద్రంలోని షాలిమార్  ఫంక్షన్  హాల్ లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్  విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్  ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ, కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. మైనార్టీ కమిషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జనరల్​ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ వైస్  చైర్మన్  ఆనంద్​గౌడ్​ పాల్గొన్నారు.