సీఎంను కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

సీఎంను కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

వెలుగు,‌‌‌‌ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. ఆయనతోపాటు తాజా లిస్టులో టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్, డాక్టర్ మల్లు రవి సీఎంను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించి, తమ ఎంపికకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి తదితరులు ఉన్నారు.