పితృత్వ సెలవులకు అప్లై చేసిన ఎంపీ

పితృత్వ సెలవులకు అప్లై చేసిన ఎంపీ

తనకు తొమ్మిది రోజుల పాటు పితృత్వ సెలవులు కావాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. తన భార్య నిండు గర్బవతి అని.. ఆమె ఏ క్షణంలోనైనా బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో తాను తన భార్య దగ్గర ఉండాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అందుకోసం తనకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో తొమ్మిది రోజులపాటు సెలవు మంజూరుచేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.

For More News..

దేశంలోకి కరోనా ఎంటరై నేటికి ఏడాది

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్వార్టర్స్‌లో భారీ చోరీ

యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే