ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముగ్గురు చిన్నారులు చనిపోయారు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముగ్గురు చిన్నారులు చనిపోయారు

హైదరాబాద్: మంగర్ బస్తీలో గోడ కూలి చనిపోయిన ముగ్గురు చిన్నారుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నగరంలోని మంగర్ బస్తీలోని ఇళ్లను ఎమ్మెల్సీ రాంచంద్రరావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. రెండు రోజుల క్రితం గోడ కూలి చనిపోయిన చిన్నారుల కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించారు. చిన్నారుల కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని విమర్శించారు.ఇప్పటికైనా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.