
- ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని, దీనిని తాము దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బలుపు కాదని, వాపే అని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారనే భయం ప్రజల్లో ఉందన్నారు. బీజేపీలో గెలిచినవారెవరు బీఆర్ఎస్లో చేరలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కతాను ముక్కలే అని చెప్పారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓబీసీ వర్గాలకు చేరువయ్యేలా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించామన్నారు. బీసీ గర్జన, సమ్మేళనాలు నిర్వహించి ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్తామని వివరించారు.