బీఆర్​ఎస్​కు చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు మద్దతివ్వాలె: లక్ష్మణ్

బీఆర్​ఎస్​కు చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు మద్దతివ్వాలె: లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోదీ తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన పోరాటం వల్లే కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకు వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 

మంగళవారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం తర్వాత ఆయన మీడియా తో మాట్లాడా రు. బీఆర్ఎస్ చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదన్నారు. మహిళా రిజ ర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని చెబుతున్న ఆ పార్టీ.. మహిళలకు ఎన్ని సీట్ల కేటాయించిందో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. 2014–2018 వరకు బీఆర్ఎస్ సర్కార్ కేబినెట్ లో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు రానున్న రోజుల్లో రాజకీ యంగా పుట్టగతులు ఉండవన్నారు.