నవంబర్ చివరి వారంలో ఎన్నికలు : ఉత్తమ్​ కుమార్​రెడ్డి

నవంబర్ చివరి వారంలో ఎన్నికలు : ఉత్తమ్​ కుమార్​రెడ్డి

కోదాడ, వెలుగు: బీఆర్ఎస్​ను ఇంటికి పంపడానికి ప్రజలు రెడీగా ఉన్నారని ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారం కాంగ్రెస్​దేనని స్పష్టం చేశారు. నవంబర్​చివరి వారంలో ఎన్నికలు ఉండొచ్చని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం కోదాడలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సాండ్, ల్యాండ్ దోపిడీ జరుగుతోందని, ఆ పార్టీ నాయకులు వైన్స్, మైన్స్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. 

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈ దందాలు మరింతగా పెచ్చుమీరాయన్నారు. ఈ అరాచకాలకు మూడు నెలల్లో తెరపడుతుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి తాను, కోదాడ నుంచి తన సతీమణి పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో 50 వేల కంటే అధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, నాయకులు లక్ష్మినారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, ధనమూర్తి, వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.