- రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి వివేక్కు రుణపడి ఉంటాం: షేక్ సలావుద్దీన్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ప్రెసిడెంట్షేక్ సలావుద్దీన్ అన్నారు.
ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి తెలంగాణలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్ఫామ్వర్కర్లు రుణపడి ఉంటారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులకు గౌరవం, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
