న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్య నేతలతో భేటీ తర్వాత ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు. సీఎం అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతున్నదని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదు.
3సరైన పద్ధతిలో సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుంది. వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ టికెట్పై గెలిచాను. ఇన్ని సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా పార్టీలో నేను ఒక్కడినే ఉన్నా. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నా పేరును కూడా సీఎం రేసులో పరిశీలిస్తారని ఆశించాను” అని వివరించారు. ఉత్తమ్తో భేటీ తర్వాత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేలు ఇచ్చిన ఏకవాక్య తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు అందించేందుకే ఢిల్లీ వచ్చాను” అని తెలిపారు.