సొంత పార్టీపై ఎంపీ ఘాటు విమర్శలు

సొంత పార్టీపై ఎంపీ ఘాటు విమర్శలు

యూపీలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ లక్నోలో ఇటీవల నిరుద్యోగులు ధర్నా చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టారు. ఇందులో చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనపై వరుణ్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. వీళ్లు కూడా భరతమాత బిడ్డలేనని.. వారి గోడు వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలైతే వీరిని ఇలాగే కొడతారా... గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండని అడిగారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి.. అర్హులైన అభ్యర్థులున్నప్పుడు ఎందుకు పోస్టులు భర్తీ చేయడం లేదని వరుణ్ గాంధీ ప్రశ్నించారు.