ఐపీఎల్​లో ధోనీ కొత్త పాత్ర!

ఐపీఎల్​లో ధోనీ కొత్త పాత్ర!

 న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్‌‌‌‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌ సీఎస్కే కెప్టెన్, ఎంఎస్‌‌‌‌ ధోనీ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఈ మేరకు ‘కొత్త సీజన్‌‌‌‌లో కొత్త పాత్ర  కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి’ అంటూ  సోమవారం సోషల్‌‌‌‌ మీడియాలో చేసిన పోస్ట్‌‌‌‌తో మహీ హింట్ ఇచ్చాడు. అయితే, ఈ పోస్ట్ అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ధోనీ కెప్టెన్‌‌‌‌గా తప్పుకొని ప్లేయర్‌‌‌‌‌‌‌‌గానే ఆడతాడని, లేదంటే ఆటకు వీడ్కోలు పలికి సీఎస్కే మెంటార్‌‌‌‌‌‌‌‌గా ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

42 ఏండ్ల ధోనీ గత సీజన్‌‌‌‌ లో సీఎస్కేకు టైటిల్ అందించిన తర్వాత మళ్లీ గ్రౌండ్‌‌‌‌లో కనిపించలేదు. సీఎస్కే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్‌‌‌‌ స్టార్ట్ చేసింది. ఇంకా క్యాంప్‌‌‌‌లో చేరని మహీ ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు. మరోవైపు బొటన వేలు గాయానికి సర్జరీ చేయించుకున్న  సీఎస్కే ఓపెనర్ ‌‌‌‌కాన్వే ఈ సీజన్‌‌‌‌ మొత్తానికి దూరం కానున్నాడు.  సీఎస్కే ఈ నెల 22న జరిగే లీగ్ తొలి మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీతో తలపడనుంది.