యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో కార్లోస్ అల్కరాజ్ చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. 20 ఏళ్ళ అల్కరాజ్ ప్రస్తుతం టెన్నిస్ లో సృష్టిస్తున్న సంచలనాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవలే వింబుల్డన్ లో ఛాంపియన్ జొకోవిచ్ ని మట్టి కురిపించిన ఈ స్పానిష్ స్టార్.. తాజాగా యూఎస్ ఓపెన్ లో సెమీస్ కి చేరుకున్నాడు. గురువారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అలెగ్జాన్డర్ జ్వరెవ్ ని 6-3,6-2,6-4 తేడాతో వరుస సెట్లలో మట్టి కురిపించాడు. మ్యాచ్ ఆధ్యంతం ఎక్కడా కూడా అల్కరాజ్ ప్రత్యర్థికి ఎలాంటి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వరుసగా రెండో సారి యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ కి చేరుకున్నాడు.
మ్యాచ్ వీక్షించిన ధోనీ
యూఎస్ ఓపెన్ లో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హాజరవ్వడం గమనార్హం. పొడవాటి జుట్టుతో బ్లాక్ టీ షర్ట్ లో తళుక్కున మెరిసిపోయాడు. పక్కన ఉన్న ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం గమనించవచ్చు. ధోనీకి టెన్నిస్ మ్యాచులు చూడడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ తో కలిసి టెన్నిస్ మ్యాచ్ చూసాడు. ఇక యూఎస్ ఓపెన్ విషయానికి వస్తే మరో క్వార్టర్ ఫైనల్లో మెద్వదేవ్ 6-4,6-3,6-4 తేడాతో రూబ్ లెవ్ ని ఓడించి అల్కరాజ్ తో సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. మరో సెమిస్ లో జొకోవిచ్ తో షెల్టాన్ తలపడతాడు.
Like us, @msdhoni is a tennis fan too ?
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the semifinal clash between @carlosalcaraz & @AlexZverev ?#SonySportsNetwork #USOpen pic.twitter.com/a8I74XRlRL